సుల్తాన్బజార్, మార్చి 31 : యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ కళాశాల పూర్వ విద్యార్థి సీఆర్పీఎఫ్ జవాన్ ఆదివారం వీర మరణం పొందడం బాధాకరమని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె.లక్ష్మణ్నాయక్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి చెందిన విష్ణు మాసబ్ ట్యాంక్లోని సైఫాబాద్ సైన్స్ కళాశాలలో 2019 బ్యాచ్లో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివారని, ఎంతో చురుకుగా ఉండే వారని అన్నారు. బార్డర్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన జవాన్ విష్ణు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మనోధైర్యాన్ని కల్పించాలని అన్నారు. జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ పల్లాటి నరేశ్, అధ్యాపక బృందం, విద్యార్థులు నివాళులర్పించారు.