జవహర్నగర్, ఆగస్టు 27: తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దూసుకెళ్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రతి పక్షాలు ప్రజలకు ఏమీ చెప్పాలో తెలియక బిత్తరపోతున్నాయని విమర్శించారు. జవహర్నగర్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు 200 మంది భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ 10ఏండ్లలోనే తెలంగాణను అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్గా నిలిపారన్నారు. శ్వాస ఉన్నంత వరకు ప్రజాసేవకే నా జీవితం అంకితం చేస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, మేక లలితాయాదవ్, జిట్ట శ్రీవాణి, మెట్టు ఆశాకుమారి, పల్లపు రవి, సతీశ్కుమార్, సంగీతారాజశేఖర్, శాంతికోటేశ్ గౌడ్, చిత్రాసుబ్రహ్మణ్యం, లక్ష్మి, ప్రేమల శ్రీనివాస్, నిహారిక, శ్రీకాంత్, రాంచందర్, పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.