Hyderabad | జాంబియా దేశస్తురాలికి ఎల్బీనగర్ కోర్టు 14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. హెరాయిన్ను సరఫరా చేస్తూ పట్టుబడిన కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.
ఇటీవల శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్టులో తనిఖీలు చేస్తున్న సమయంలో జాంబియా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ హ్యాండ్ బ్యాగ్తో పాటు సూట్ కేస్ , డాక్యుమెంట్ ఫోల్డర్లో డ్రగ్స్ దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ అధికారులకు చిక్కింది. ప్రయాణికురాలిని దక్షిణ ఆఫ్రికా వాసిగా గుర్తించారు. నిందితురాలి నుంచి రూ.50 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు.. యువతిని ఎల్బీనగర్ కోర్టులో హాజరుపరచగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.