వెంగళరావునగర్, సెప్టెంబర్ 18: కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించి.. ఆమె బలవన్మరణానికి కారణమైన భర్తకు పదేండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ.. శనివారం 4వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి.హేమంత్కుమార్ తీర్పు చెప్పారు. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేందర్నగర్ సమీపంలోని చింతల్మెట్కు చెందిన నస్రీన్ బేగంకు బోరబండలోని హెచ్ఎఫ్నగర్కు చెందిన ఎండీ ఇమ్రాన్ ఖాన్ అలియాస్ వాహీద్(36)తో 2012 డిసెంబర్లో వివాహం జరిగింది. కొన్నాళ్లకు ఇమ్రాన్ ఖాన్, అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు అదనంగా కట్నం తీసుకురావాలంటూ.. నస్రీన్ బేగంను వేధించడం మొదలు పెట్టారు. భరించలేక ఆమె 2015 డిసెంబర్ 19న ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం శనివారం నిందితుడు ఇమ్రాన్ ఖాన్కు జైలు, జరిమానా విధిస్తూ.. న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.