మేడ్చల్ జోన్ బృందం, జూలై 6: మాజీ ఉప ప్రధాని జగ్జీవన్రామ్ చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు. కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి అందించిన సేవలను, దేశ స్వాతంత్రంలో పోషించిన పాత్రను నాయకులు, ప్రజలు గుర్తు చేసుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా బాబూ జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటాలు, విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.