సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పదవికి పాటిమీది జగన్మోహన్రావు సోమవారం రాజీనామా చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తన రాజీనామా లేఖను సమర్పించారు.
తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా.. అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన జగన్కు కేసీఆర్ టీఎస్టీఎస్ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఐటీ శాఖకు కేటీఆర్ ఎనలేని వన్నె తీసుకువచ్చారన్నారు. కేటీఆర్ మంత్రిత్వ శాఖలో తాను పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అందరిలాగే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.