ఖైరతాబాద్, డిసెంబర్ 18 : తెల్లవారుతూనే పరుగులతో నెక్లెస్రోడ్ వేడెక్కింది. ఆదివారం పీపుల్స్ప్లాజా వేదికగా ‘ఇట్స్ మై సిటీ…మై రన్’ నినాదంతో నిర్వహించిన 18వ ఎడిషన్ ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ ఉత్సాహంగా సాగింది. ఎలైట్ 10కే, ఓపెన్ కేటగిరిలో 10కే రన్తో పాటు 5కే రన్ నిర్వహించారు. ఈ రన్ను హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ ప్రతినిధులు బాస్కో, అనిల్, శివాని , విశ్వ, యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో ప్రణవ్, పీపీఎల్ రాష్ట్ర హెడ్ శ్రీకాంత్ నాయక్తో కలిసి ప్రారంభించారు. 72 ఏండ్ల సీహెచ్ఎన్బీ రావు, పరిశోధకురాలు సతీందర్ కౌర్ శిశువుతో కలిసి పాల్గొన్నారు. మొత్తం 4,800 మంది ఈ రన్లో పాల్గొన్నారని, ఈ రన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదలకు సాయం చేసేందుకు వెచ్చిస్తామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం పరుగులో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.