సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ) : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో సోమవారం తెల్లవారుజామున తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల జల్లులు పడ్డాయి. రాత్రి 8.30 గంటల వరకు రాజేంద్రనగర్లో అత్యధికంగా 4.0 మిల్లీమీటర్లు, చార్మినార్, సర్దార్మహల్లో 3.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, పగలు ఎండలు మాత్రం దంచికొట్టాయి. సోమవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.8డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.4డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 40శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.