సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) :నగర శివారు జవహర్నగర్లో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారులు కొరడా ఝులిపించారు. జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ ఖాళీ స్థలాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను మంగళవారం ఉదయం హెచ్ఎండీఏ ఎస్టేట్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం స్థానిక పోలీసుల సహకారంతో కూల్చివేశారు. సుమారు 3వేల గాజల స్థలాల్లో వెలిసిన మూడు ఇండ్లు, ఐదు బేస్మెంట్లు, కరెంటు స్తంభాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలను తొలగించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో హెచ్ఎండీఏ అధికారులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి, నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.