హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తును సీఎం కేసీఆర్ నాయకత్వంలో సరఫరా చేస్తుండటంతోనే పెట్టుబడులు వస్తున్నాయని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అభిప్రాయపడ్డారు. విద్యుత్ రంగానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చిన ఫలితంగానే రాష్ట్రం పెట్టుబడుల నిలయంగా మారిందన్నారు. శుక్రవారం ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసొసియేషన్ (టీఎస్పీఈఏ) 2023 డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రప్రజలకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్తునందిస్తున్నామని స్పష్టం చేశారు. నూతన పీఆర్సీతో పాటు ఉద్యోగుల ఇతర సమస్యలను సీఎం కేసీఆర్తో మాట్లాడి త్వరగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ ట్రాన్స్కో, జెన్కో జేఎండీ శ్రీనివాస్రావు, టీఎస్పీఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రత్నాకర్రావు, పీ సదానందం, వెంకటనారాయణ, అంజయ్య, జనప్రియ, శ్రీనివాస్రెడ్డి, సురేశ్, ప్రశాంత్, శామ్యానాయక్, వేణుమాధవ్, వెంకటేశ్, కిశోర్, గోపాల్రావు, గోపాలకృష్ణ, బాగయ్య పాల్గొన్నారు.