మాదాపూర్, డిసెంబర్ 21: మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఐషర్ కంపెనీకి చెందిన ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ స్మార్ట్ షిప్ట్తో ప్రో 8035ఎక్స్ఎం ట్రక్ను గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రక్ బిజినెస్, వీఈ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ గగన్దీప్ సింగ్ గందోక్ హాజరై ట్రక్ ఫీచర్స్ను వివరించారు. ఐషర్ ప్రో 8000 సిరీస్ ట్రక్ రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గణనీయమైన తోడ్పాటును అందించినట్లు తెలిపారు. వెయ్యికి ఐషర్ ప్రో 8000 సిరీస్ టిప్పర్లు వివిధ నీటిపారుదల, మైనింగ్ సైట్లలో పనిచేస్తున్నాయని చెప్పారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే 500 యూనిట్ల ఈ సిరీస్ ట్రక్లను వినియోగించినట్లు చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో 8035 ఎక్స్ ఎం ట్రక్ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇది 350 హెచ్పీతో టిప్పర్ అత్యంత శక్తివంతంగా నిలువనున్నట్లు తెలిపారు. ఈ ట్రక్ కోసం మై ఐషర్ అనే యాప్ అందుబాటులో ఉన్నదని, ఆటోమేటెడ్, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో, క్యాబిన్ లోపల ఫుల్ ఏసీతో క్యాబిన్.. డ్రైవర్కు గొప్ప అనుభూతి కలిగిస్తుందని చెప్పారు.