సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్(ఐఐఎంసీ) డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో ‘21వ శాతాబ్దపు నైపుణ్యాలు-సుస్థిరాభివృద్ధి’పై రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సాంకేతిక సమాచారం వంటి అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సదస్సును ఆఫ్ లైన్, ఆన్లైన్లో నిర్వహించారు. వక్తలు బిజినెస్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ కబాలి పి.సుబ్రహ్మణ్యన్, శ్రీలంక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ఆర్.వివేకానంతరసలు సదస్సులో నేటి తరంలో కమ్యూనికేషన్ను మెరుగుపర్చుకునేందుకు అవసరమైన నైపుణ్యాల ప్రాముఖ్యతపై ఉపన్యసించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పారిశ్రామిక వేత్తలకు పరిశోధనా పత్రాలను సమర్పించారు. మూడు ఉత్తమ పరిశోధనా పత్రాలకు నగదు బహుమతులను అందజేయనున్నట్లు ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ తెలిపారు. ఈ సందర్భంగా 109 అంశాలపై 71 పరిశోధనా పత్రాలకు సంబంధించిన సావనీర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల మాజీ ప్రిన్సిపాల్ పి.పూర్ణచందర్ రావు, పద్మప్రియ, తదితరులు పాల్గొన్నారు.