హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ సోమవారం ప్రారంభమై, 9న ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్కు 1,500లోపు విద్యార్థులు హాజరుకానుండగా, వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 36 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ నెల 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 22న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలున్నాయి. ఈ ఇంటర్నల్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20 వరకు జరుగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఫస్టియర్ నుంచి 2,70,503 మంది విద్యార్థులు, సెకండియర్ నుంచి 1,41,501 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్టికెట్లను రెండు మూడు రోజుల్లో వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు వెల్లడించారు.