కాచిగూడ,ఆగస్టు 12 : ఆధ్యాత్మికత వాతావరణంలో ప్రతి ఒక్కరు భక్తిని పెంపొందించుకోవాలని కాచిగూడ టీఆర్ఎస్ వార్డు సభ్యురాలు దాత్రిక్ సునీత అన్నారు. హనుమాన్ దేవాలయ ప్రతినిధులు నాగేందర్బాబ్జి, శ్రీనివాస్ సంతోశ్, విజయ్కృష్ణ, చైతన్య ఆధ్వర్యంలో చెప్పల్బజార్లోని హనుమాన్ దేవాలయంలో నాగదేవతల విగ్రహలను వేద పండితుల మంత్రోత్సవాల నడుమ ప్రతిష్టాపించారు.
అనంతరం నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగావార్డు సభ్యురాలు మాట్లాడుతూ.. పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరికి భక్తి అవసరమని ఆమె సూచించారు. గత 45 రోజులుగా తమిళనాడుకు చెందిన శిల్పులు ఇక్కడి వచ్చి ఆరు నాగదేవతల విగ్రహలను చెక్కినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగేందర్బాబ్జి, దాత్రిక్ సునీత, సునీల్బిడ్లాన్, సదానంద్, ఎల్.రమేశ్, బబ్లూ, ఆంటోని, నర్సింహనిహల్, జైక్రిత, ప్రజ్ఞా, ప్రజలు పాల్గొన్నారు.