సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘స్టార్టప్ ఇండియా- ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా గురువారం టీ-హబ్లో ప్రత్యేకంగా చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో స్టార్టప్ ఎకో సిస్టం ఏ విధంగా ఉండాలి, అట్టడుగున ఉన్న ఆవిష్కర్తలను విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అంశంపై నిపుణులు ప్రసంగించారు. స్టార్టప్ రంగంలో నిపుణులైన వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఇంకా మెరుగైన స్టార్టప్ ఎకో సిస్టంను రూపొందించాలని సూచించారు. చర్చా కార్యక్రమంలో టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్, వీ హబ్ సీఈఓ దీప్తి రావుల, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ సీఐఈ డాక్టర్ శాంత తౌటమ్, టీ-వర్క్స్ సీఈఓ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.