సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సిగ్నలింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో భారతీయ రైల్వేలు ముందంజలో ఉన్నాయని న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు సభ్యులు (మౌలిక సదుపాయాలు) ఆర్కే మంగళ అన్నారు. సికింద్రాబాద్లోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూషనల్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలి కమ్యూనికేషన్ల (ఇరిసెట్) 65వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైల్వేలోని అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఇండియన్ రైల్వే విజయం సాధిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, ఇతర రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.