సిటీబ్యూరో, మే 29(నమస్తే తెలంగాణ): జూన్ 7 నుంచి 9 వరకు రేతిబౌలిలోని కింగ్స్ కొహినూర్ కన్వెన్షన్ సెంటర్లో ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ కొలువుదీరుతున్నదని నిర్వాహకులు బుధవారం పేర్కొన్నారు. ఇందులో 250 మంది కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీలు, 3,500 కళా ఖండాలతో ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిపారు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9న రాత్రి గంటలకు ముగుస్తుందని వెల్లడించారు.