హైదరాబాద్: హైదరాబాద్లోని పలుచోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 20 బృందాలుగా విడిపోయిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ కంపెనీ, దాని అనుబంధ సంస్థలకు సంబంధించిన ఆఫీసులు, యజమాని ఇండ్లపై తెల్లవారుజామున 4 గంటలకే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సుమారు 60 మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.
గచ్చిబౌలిలోని ఎక్సెల్ ఆఫీసుతోపాటు మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్లో, బాచుపల్లి, చందానగర్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, చెన్నైలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా 18 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.