హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఐటీ (IT) దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు కంపెనీలతోపాటు వ్యక్తుల ఇండ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. ఈ తనీఖీల్లో 100 బృంధాలు పాల్గొంటున్నట్లు సమాచారం. హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు, రఘువీర్, వజ్రనాథ్ ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా కూకట్పల్లిలోని హిందూ ఫార్చ్యూన్లో కూడా అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి.