మెహిదీపట్నం, మార్చి 8 : కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంబాగ్లో తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాల, పాఠశాల భవనాన్ని శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు మందడి అనిల్కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతో కలిసి ప్రారంభించిన అనంతరం భవనంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినొద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, టెమ్రిస్ సెక్రటరి అయేషా నుస్రత్ జహ, తదితరులు పాల్గొన్నారు.