బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ వనాన్ని శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి గురువారం ప్రారంభించారు. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డా.కే.సీతారామారావుతో కలిసి ఎమ్మెల్సీ వాణీదేవి పలు రకాలైన ఔషద మొక్కలను నాటారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం ఔషద వనం ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. యూనివర్సిటీలో పచ్చదనాన్ని పెంచడం కోసం అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.ఇ.సుధారాణి, రిజిస్ట్రార్ డా.లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.