వ్యవసాయ యూనివర్సిటీ, అక్టోబర్ 29: కుల మతాలకు అతీతంగా పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ వల్లే బీఆర్ఎస్లో భారీ చేరికలు జరుగుతున్నాయని, మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన నివాసం వద్ద నియోజకవర్గంలోని సులేమాన్నగర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. సులేమాన్నగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఎండీ గౌస్, శాస్త్రీపురం డివిజన్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఎంఐఎం చెందిన సిఇదా తస్లిమ్ ఫాతిమా ఆధ్వర్యంలో దాదాపు 100 మంది చేరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు షేక్ మతిన్, శౌకత్, మీర్ అబ్బాస్, సయ్యద్ అవాజ్ హుస్సేన్, నసీం, ఎండీ ఇస్మాయిల్, అక్బర్, జీషాన్, తయార్, రూఫ్ తదితరులు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్లో ప్రకాశ్ గౌడ్కు అడ్డులేదు
శంషాబాద్ రూరల్, అక్టోబర్ 29: రాజేంద్రనగర్లో ప్రకాశ్ గౌడ్ గెలుపునకు అడ్డులేదని తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ కొండా పరమేశ్గౌడ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2009లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం చేస్తూ ముందుకుసాగుతున్నట్లు తెలిపారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ను భారీ మోజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, మిషన్భగీరథ ద్వారా తాగునీరు, సీఎం రిలీఫ్ ఫండ్, అసరా పింఛన్లు ఇలా అనేక పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నార. సమావేశంలో వార్డు అధ్యక్షులు పెంటయ్య, సుదర్శన్గౌడ్, దామోదర్, చంటి తదితరులు ఉన్నారు.
బండ్లగూడలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం షురూ
బండ్లగూడ, అక్టోబర్ 29: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను భారీ మెజార్టీతో గెలుపించుకుంటామని మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు బస్తీల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.