సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నగారా మోగడంతో పోలీసులు నగర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. మొదటి రోజు నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ. 18 కోట్ల వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ తనిఖీలలో పట్టుబడ్డ నగ దు, ఆభరణాలను ఐటీ శాఖతో పాటు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పౌరుల వద్ద రూ. 50 వేల కంటే ఎక్కువగా నగదు నిల్వ ఉండకూడదని పోలీసులు సూచించారు.