మైలార్దేవ్పల్లి, అక్టోబర్ 1: పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తున్నదని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మూడవ విడత లక్కీ డ్రాలో ఎంపికైన వెయ్యి మంది డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆదివారం మైలార్దేవ్పల్లిలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ మూడవ విడతలో రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వెయ్యి మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.