మాదాపూర్, డిసెంబర్ 11: ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరనున్నది. అంతర్గత రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ంసీ అధికారులు పలుచోట్ల అంతర్గత రహదారులను తీర్చిదిద్దుతున్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లోని రహదారులు గుంతలతో అస్తవ్యస్తంగా మారడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ప్లాట్స్ కాలనీలో రూ.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కాలనీలో మూడు లేన్లలో కలిపి మొత్తం 320 మీటర్ల మేర అంతర్గత రహదారులకు సంబంధించిన పనులను చేపట్టేందుకు అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
సాఫీగా ప్రయాణించేలా..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేయడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రూ. 40 లక్షల వ్యయంతో 320 మీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కాలనీలోని అంతర్గత రహదారులను చదును చేయడం జరుగుతుంది.
– ప్రశాంత్, ఏఈ, మాదాపూర్ (జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం)