శేరిలింగంపల్లి : గచ్చిబౌలిలోని డాగ్పార్క్లో మార్స్ పెట్కేర్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘‘ఇండిస్ డాగ్ షో’’ ఆకట్టుకుంది. వీధి, పెంపుడు కుక్కల దత్తతను పొత్సహిస్తూ నిర్వహించిన ఈ డాగ్షోలో వివిధ రకాల శునకాలు తమ అందచందాలతో అందరినీ ఆకట్టుకున్నాయి.
తమదైన శైలిలో ఫ్యాన్సీ డ్రెస్, విధేయత స్వభావం, ఆందమైన, తెలివైన శునక పోటిల్లో ఎంతో ఉత్పాహాంగా పెంపుడు జంతువులు పాల్గొని తమ ప్రతిభ పాటవాలు ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నాయి. ఆదివారం డాగ్పార్క్లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా జీహెచ్ఎంపీ పరిధిలో వీధి కుక్కలకు సేవలందించేందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శునక అంబులెన్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం వీధి కుక్కల శ్రేయస్సుకు పాటుపడుతుందన్నారు. డాగ్పార్క్లను ఏర్పాటుచేసి వీధి కుక్కల దత్తత, పెంపుడు జంతువుల సంరక్షణలకు చర్యలు తీసుకుంటుందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, వీధి కుక్కలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా అంబులెన్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. మార్స్ పెట్కేర్ ఇండియా జనరల్ మేనేజర్ గణేష్ రమణీ, డాక్టర్ మురళీ తదితర ప్రముఖులు, జంతుప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.