Ilaiyaraaja Concert | సిటీబ్యూరో: నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ కోసం అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం గచ్చిబౌలి స్టేడియంలో మ్యాస్ట్రో ఇళయరాజా గౌరవార్థం పాటలను ప్రముఖ గాయకులు ఆలపించి ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, విశాల్ చంద్రశేఖర్ స్వరాలు వినిపించనున్నారు. ఆదివారం ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ ఉంటుంది.
ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించినట్టు హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకులు తెలిపారు. మంత్రి కేటీఆర్, సినీ హీరో చిరంజీవి, నాగార్జున తదితరులు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు.