హైదరాబాద్ : రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఖానామెట్లోని కోహినూర్ అపార్ట్మెంట్లో ఇఫ్తార్ వేడుకలు(Iftar Celebrations) ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్లోని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దం రంజాన్ పర్వదినం అన్నారు.
మత సామరస్యం వెల్లివిరియాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని, అల్లాహ్ కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలోముస్లిం సోదరులు, పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు