తెలుగు యూనివర్సిటీ, జనవరి 5: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని బేగంపేట్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఏసీపీ జి. శంకర్రాజు సూచించారు. బేగంపేట్ ట్రాఫిక్ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని ఐసీఐసీఐ అకాడమీలో ఫర్ స్కిల్ సిబ్బందికి రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో శంకర్రాజు మోటారు వాహనాల చట్టం గురించి వివరించారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి వాహనాలతో రావొద్దని అన్నారు. చలాన్తో పాటు జైలు శిక్షకు గురి కావాల్సి వస్తుందన్నారు. లైసెన్స్ లేకుండా రోడ్లపైకి వచ్చిన ఆరు వేల మందికి బేగంపేట్లోని టీటీఐలో కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో టీటీఐ శిక్షకులు రజనీకాంత్రెడ్డి, మురళీ మోహన్ పాల్గొన్నారు.