రామంతాపూర్, నవంబర్ 30 : దేవాలయ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలుంటాయిని దేవాదాయ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి హెచ్చరించారు. బుధవారం రామంతాపూర్లోని పలు ప్రాంతాల్లోని దేవాలయ భూములను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి, తాసీల్దార్ సునీత, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈఓ నరేందర్రావుతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం దేవాలయ భూముల రక్షణకు తగు చర్యలుంటాయన్నారు. భూమలను పూర్తి స్థాయిలో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన ఉన్న గ్రామ కంఠం స్థలాన్ని పార్కింగ్కోసం ఉపయోగిస్తామన్నారు. ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా రాత పూర్వకంగా ఇవ్వాలన్నారు.
శ్రీరామకాలనీ లోని సర్వేనంబర్ 91,1,2 లోని 33 గుంటల స్థలంలో కల్యాణ మండపం నిర్మాణం చేస్తామన్నారు. ఇందులో ఆరు గుంటల దేవాలయ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. భగాయత్ సర్వేనంబర్-1లో 12 గుంటలస్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని , గడ్డి భూములకు వేలం వేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు వెంక ట్రావు, సంకూరి కుమారస్వామి, కామేశ్వర్రావు, వంగాల సంతోష్గుప్తా, పరిశ్రీనివాస్, శైలేందర్, సుధాకర్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.