మియాపూర్ : ఉద్యోగులు నివసించే టీఎన్జీవోస్ కాలనీలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీని కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో సీసీ రోడ్ల(CC Roads) నిర్మాణం, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు, తాగునీటి వసతి పెంచాలని కోరారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో పని చేసే ఉద్యోగుల(Employees) సేవలు ఎంతో విలువైన వన్నారు. ఉద్యోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని అన్నారు. కాలనీలో పచ్చదనం పరిశుభ్రత వసతుల కల్పనలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం ..
శేరిలింగంపల్లి : రక్తదానం(Blood donation) ప్రాణదానంతో సమానమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డైమండ్హైట్స్లో కల్వకొలను చిత్తరాంజన్దాస్ ట్రస్ట్, సనాతన ధర్మ వారధి కల్వకొలను రామచంద్రమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని రెడ్క్రాస్ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, కొవిడ్ (Covid) అనంతరం రక్త నిల్వలు భారీగా తగ్గిపోయాయన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రగడ సత్యనారాయణ, ప్రసాద్, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.