బాలానగర్, ఏప్రిల్ 9 : కేంద్ర ప్రభుత్వానికి నిరుపేద ప్రజల పట్ల ప్రేమ ఉంటే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 800 ఎకారాల పైచిలుకు ఉన్న ఐడీపీఎల్ భూముల్లో 400 ఎకరాలు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఆదివారం బాలానగర్ పాత విమానాశ్రయం రోడ్డులోని తెలంగాణ గార్డెన్లో ఏర్పాటు చేసిన బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎంగా కేసీఆర్ ఉన్నందునే తెలంగాణలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, విద్యా రంగం, వైద్య రంగాలు ఎంతో పురోభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. బాలానగర్లో ట్రాఫిక్ రద్దీతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సహకారంతో బాలానగర్లో ైప్లెఓవర్ నిర్మించామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి, పతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బాలానగర్ మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచార్య, బీఆర్ఎస్ నాయకులు మందడి సుధాకర్రెడ్డి అంబటి సునీల్కుమార్, నరేందర్గౌడ్, శాకయ్య, తదితరులు పాల్గొన్నారు.
మూసాపేటలో నేడు ఆత్మీయ సమ్మేళనం
మూసాపేట, ఏప్రిల్9 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మూసాపేట డివిజన్ పరిధిలోని రాయల్ గార్డెన్స్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్ ఆధ్వర్యంలో నేడు బీఆర్ఎస్ పార్టీ నేతల ఆత్మీయ సమ్మెళనం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథథులుగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్తో పాటు కార్పొరేటర్లు హాజరుకానున్నా శ్రవణ్కుమార్ తెలిపారు.
దళితుల అభ్యున్నతికి దళితబంధు
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 9 : దేశంలో ఎక్కడాలేని విధంగా దళితుల అభ్యున్నతికి కోసం ప్రభుత్వం దళితుబంధుతో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గం దళిత ఐక్యవేదిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టడంతో పాటు దళితుల అభ్యున్నతికి దళితబంధుతో సహాయం చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గంలో సైతం కూకట్పల్లి వై జంక్షన్లోని మెట్రో స్టేషన్కు అంబేద్కర్ పేరును.. బాలానగర్ ఫ్లైఓవర్కు బాబూ జగ్జీవన్రామ్ పేరును పెట్టడం జరిగిందన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నగరం నడిబొడ్డున నిర్మించిన 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దళితులందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం దళిత ఐక్యవేదిక నేతలు ఎమ్మెల్యే కృష్ణారావుకు సంపూర్ణ మద్దతును తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘం నేతలు కర్క పెంటయ్య, బొట్టు విష్ణు, అరిటాకుల రఘునాథ్బాబు తదితరులు ఉన్నారు.