వెంగళరావునగర్,మార్చి 31: స్నేహితుడిని మందు పార్టీకి ఇంటికి పిలిస్తే..మత్తులోకి జారుకున్నాక గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం.. యూసూఫ్గూడ సమీపంలోని లక్ష్మీనర్సింహనగర్కు చెందిన రామకృష్ణ ఆదివారం అతడి భార్య సునీత ఇంట్లో లేని సమయంలో తన స్నేహితుడు ఉదయ్ కుమార్ను ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చాడు. తాగాక రామకృష ్ణమత్తులోకి జారుకున్నాడు.
ఇదే అదునుగా భావించి ఉదయ్కుమార్ ఇంట్లోని గ్యాస్ సిలిండర్తో పాటు రూ.500 అపహరించుకెళ్లాడు. సునీత ఇంటికి వచ్చి చూసుకునేసరికి గ్యాస్ సిలిండర్,డబ్బు కనిపించలేదు. తన భర్తను నిలదీయగా స్నేహితుడిని ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చానని బదులిచ్చాడు. స్నేహితుడిపై అనుమానం ఉందని చెప్పడంతో మంగళవారం సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.