సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మైనార్టీ లబ్ధిదారులకు సబ్సిడీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీస్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లోని జంక్షన్లను ఉపయోగించకపోవడం మంచిదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు తమ వాహనాలకు కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.