సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ) : మోబిస్ ఇండియా, బిట్స్ ఫిలానీ హైదరాబాద్తో తెలంగాణ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ఆటోమోటివ్ రంగంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
బుధవారం టీ హబ్లో బిట్స్ ఫిలానీ హైదరాబాద్, మోబిస్ ఇండియాతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, ఆత్మకూరి, టీ హబ్ సీఈవో ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.