అంబర్పేట, సెప్టెంబర్ 13 : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొవిడ్ నిబంధనలననుసరించి నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని మండపాల వద్ద చిన్నారుల కోసం ఆటలపోటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
గోల్నాక డివిజన్ జైస్వాల్గార్డెన్ మైసమ్మ టెంపుల్ వద్ద నెలకొల్పిన వినాయకుడి వద్ద చిన్నారులకు పలు పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. నల్లకుంట ఫీవర్ దవాఖానలో ఏర్పాటు చేసిన వినాయకుడికి దవాఖాన సూపరింటెండెంట్ డా.కె.శంకర్, ఆర్ఎంఓ డా.విజయలక్ష్మి, ఏవో మోహన్దాస్, ఓఎస్ శ్రీనివాస్, ఫార్మసిస్టులు జె.అశోక్, పద్మజ, డాక్టర్లు సునీల్, సునిత, ప్రవీణ, కృష్ణరావు, లక్ష్మీసుధ, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్, నర్సింగ్ సిబ్బంది తదితరులు పూజలు చేశారు.