డ్రగ్స్ రహిత నగరమే లక్ష్యం.. సీపీ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హెరాయిన్-75 గ్రాములు తదితర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
కాలేజీలు, కళాశాలు, యూనివర్సిటీల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు యాంటీ డ్రగ్స్డేను పురస్కరించుకొని ప్లకార్డులను పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ప్రదర్శించారు. కాగా, బక్రీద్ నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనర్లు శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీ ఆనంద్ అధ్యక్షత వహించారు. పలు సూచనలు ఇచ్చారు. అక్రమంగా పశువులను తరలించే ముఠాలపై నిఘా పెట్టాలని చెప్పారు. రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.