Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఏప్రిల్( April )లో ఎండలు( Summer ) దంచికొట్టనున్నాయా..? పగటి ఉష్ణోగ్రతలు( Temperatures ) 40 డిగ్రీలు దాటనున్నాయా..? అంటే అవుననే వాతావరణ శాఖ( Weather Dept ) అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో ఎండల దంచికొడుతున్నాయి.
ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గత వారం రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. మార్చి 31వ తేదీన తిరుమలగిరిలో అత్యధికంగా 39.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అయితే ఏప్రిల్ నెలంతా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్లకే పరిమితం కావాలన్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే లేత రంగులో ఉన్న తేలికపాటి దుస్తులు ధరించాలని చెప్పారు. శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వచ్చే వారం రోజుల పాటు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందన్నారు. ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశం ఉంది.