సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో గ్రేటర్ మండిపోతోంది. కింది స్థాయి గాలుల ప్రభావంతో మూడు నాలుగు రోజుల నుంచి నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శనివారం నగరంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠం 42.4, కనిష్ఠం 30.0 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 25 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.