హైదరాబాద్ : నగరంలో ‘స్త్రీ కౌన్సెలింగ్ సెంటర్’ ప్రారంభమైంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ వద్ద ఈ స్త్రీ కౌన్సెలింగ్ సెంటర్ను ప్రారంభించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్కు చెందిన దాదాపు 200 మంది వాలంటీర్లు మహిళల కౌన్సెలింగ్, న్యాయ అంశాల్లో శిక్షణ పొందినట్లు తెలిపారు. గోల్కొండ పోలీస్ స్టేషన్లో మొదటగా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు అనంతరం ఆసిఫ్నగర్ డివిజన్ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. బాదల్లో ఉన్న మహిళలకు ఈ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయపరంగా సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్(క్రైమ్స్ అండ్ ఎస్ఐటీ) శిఖా గోయల్, అడిషనల్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) డీఎస్ చౌహాన్, తదితరులు పాల్గొన్నారు.