సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలో ఎక్స్ఛేంజర్దే కీలక పాత్ర ఉంటుందని పోలీసులు గుర్తించారు. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వీవీనగర్లో నివాసముండే వెంకటేశ్వర్రావుకు తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ నమ్మించి రూ. 60 లక్షలతో ఉండాయించిన గ్యాంగ్ మంగళవారం ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.
9 మంది సభ్యులు ఉన్న ఈ ముఠాలో కీలకమైన వ్యక్తులు బాపట్లలోని ఇరగడిండ్ల వానీశ్కుమార్ అలియాస్ రాజారెడ్డి , విశాఖపట్టణానికి చెందిన కర్రి కనకారావు అని పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్రావు దృష్టి మళ్లించి మోసం చేసిన కేసులో 9 మంది నిందితులు ఉండగా.. పోలీసులు ఎనిమింది మందిని అరెస్టు చేశారు. అందులో కర్రి కనకరాజుపై విశాఖపట్టణం, వరంగల్(2), పాలెం, పంజాగుట్ట(2)లో కేసులు ఉన్నాయి. వానీశ్ కుమార్పై వేదులపలి ్ల(8), బాపట్ల, ఏరెపాలెం(2), కావలి 2వ టౌన్, కావలి రూరల్, సరూర్నగర్ పోలీస్స్టేషన్లలో మొత్తం 14 కేసులున్నాయి.
ఇదిలా ఉండగా.. బాధితుడు వెంకటేశ్వర్రావుకు సంబంధించిన కేసులో నిందితులు పథకం ప్రకారం సూట్కేస్ తీసుకురావడం, అందులో రెండు ఒకేరకమైన బ్యాగులు ఉండటం, డబ్బులెక్కించిన తర్వాత బాధితుడిని మాటల్లో పెట్టి దృష్టిమళ్లించడంలో కనకరాజు ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అందువల్లే అతడిని ఎక్స్ఛేంజర్గా పిలుస్తారని పోలీసులు తెలిపారు.