ముషీరాబాద్, నవంబర్ 13: త్వరితగతిన దేశానికి కరోనా వ్యాక్సిన్ అందించడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోశించిందని కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ అ న్నారు. భారత్ బయోటిక్ వ్యాక్సిన్ తయారీ కోసం బా గా పని చేస్తోందని, కరోనాను ఎదుర్కోవడానికి వైద్యు లు, శాస్త్రవేత్తలు గొప్పగా పని చేశారని ప్రశంసించారు. శనివారం హైదరాబాద్ మారియటల్లో జరిగిన దక్షిణాది మొదటి లామ్కాన్ వైద్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాంఘిక సంక్షే మ శాఖ సలహాదారు డాక్టర్లు సుకుమార్, రమేశ్రెడ్డి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా, ఓఎన్జీసీ డైరెక్టర్ అల్కామిట్టల్, సంతోష్ పాల్గొన్నారు.