మన్సూరాబాద్, జూలై 5: ఆటోనగర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్ను నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆటోనగర్లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కు నుంచి క్రీడా ప్రాంగణం వరకు సుమారు 680 మీటర్ల పొడవునా నిర్మించనున్న బస్ టెర్మినల్కు స్థలం కేటాయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి మంగళవారం అటవీ సంరక్షణ అధికారి రాకేశ్ మోహన్ దొబ్రియల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్బే నిర్మాణం కోసం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసిన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ను ఆటోనగర్లో నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు సుమారు 20 నుంచి 25 వేల మంది నిత్యం బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. ఏపీ, తెలంగాణకు వెళ్లే ప్రయాణికుల కోసం వేర్వేరుగా 24 బస్బేలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్ రింగ్రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగిందని తెలిపారు. దీంతో అక్కడి నుంచి జిల్లాలకు వెళ్లే బస్ స్టాప్ను తొలగించి ఆటోనగర్లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కు వద్దకు మార్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోకప్ప తదితరులు పాల్గొన్నారు.