గౌతంనగర్, ఫిబ్రవరి 3 : బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం జేఎల్ఎన్ఎస్ నగర్లో శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీ నారసింహ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మ ణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షుడు రఘుకిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ.. భగవంతుని అనుగ్రహంతో కరోన బారిన పడకుండా ఎల్లప్పుడు ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉం డాలని హోమం నిర్వహించామని తెలిపారు. ప్రతి నెల చండీ, సుదర్శన, నారసింహ, రుద్ర హోమ కార్యక్రమాలతో పాటు దేవతా కల్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతోనే హోమాలు, స్వామివారి కల్యాణం చేయిస్తున్నట్లు అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వర శర్మ, యువ వాహిని కార్యదర్శి సందీప్ శర్మ, కమిటీ సభ్యులు సంతోశ్, సందీప్కుమార్, తదితరులు పాల్గొన్నారు.