సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు గల పంపిగ్ ప్రధాన లైన్, ఎంఎస్ పైప్లైన్, మదీనగూడ వద్ద నీటి కాలువ, ఇతర లీకేజీ, నిర్మాణ పనుల కారణంగా నేటి నుంచి రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. మంజీరానీటి సరఫరా ఫేజ్-2లో 1500 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్ను మార్చడానికి జంక్షన్ పనులను చేపట్టడం, ఇతర లీకేజీలు, నిర్మాణ పనుల కారణంగా గురువారం (మే 27వ తేదీ)
ఉదయం 6 గంటల నుంచి 2021 28వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాలో జరగదని జల మండలి ఎండీ తెలిపారు. సుమారు 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని, కావున కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు.
గంగారాం, దీప్తీశ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, అపర్ణ హిల్స్, ఆదర్శనగర్, శాంతినగర్, మియాపూర్, మైత్రినగర్, మదీనాగూడ, ఉషోదయ నగర్, వైశాలినగర్, రామకృష్ణ నగర్, సాయిరాంకాలనీ, మియాపూర్ క్రాస్ రోడ్స్, మాతృశ్రీ నగర్, రాజారాం కాలనీ, అంబేద్కర్ నగర్, జనప్రియ ఫేజ్-1 అండ్ 2, మియాపూర్ విలేజ్, మాధవ్నగర్, భాను టౌన్షిప్, నంది కో ఆపరేటీవ్ సొసైటీ, హుడా, మయూరి నగర్, ఎస్సీ బోస్ కాలనీ, సిర్లా గార్డెన్స్, ఆర్బిర్ బాలాజీ నగర్, అదిత్య నగర్, శ్రీరంగపురం ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.
హైదర్నగర్, అడ్డగుట్ట, నిజాంపేట్ మెయిన్రోడ్, కేపీహెచ్బీ కాలనీలోని వసంత్ నగర్, రామ్ నరేష్ నగర్.
బొల్లారం మున్సిపాలిటీ, ఐలాపూర్ గ్రామం, గండిగూడెం, సుల్తాన్పూర్, కిష్టారెడ్డిపేట్, పటేల్గూడ గ్రామం.
ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ప్రెజర్తో నీటి సరఫరా జరుగుతుంది. ఈ అంతరాయాన్ని గమనించి పైన తెలిపిన ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.