సిటీబ్యూరో, ఏప్రిల్ 3 ( నమస్తే తెలంగాణ ) : చార్మినార్ జోన్లోని చుడీ బజార్ యానిమల్ కేర్ సెంటర్ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల థియేటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్, స్టెరిలైజ్ డాగ్ సెంటర్లను పరిశీలించారు. యానిమల్స్కు రెగ్యులర్గా అందించే ఆహారం, తాగునీరు ఇష్టమైన రీతిలో కాకుండా నిర్ణీత సమయంలో ఏర్పాటు చేయాలని మేయర్ సూచించారు.
కుక్కలకు వేడి భోజనాన్ని అందించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చుడీబజార్ తో పాటు నగరంలో ఏర్పాటు చేసిన మిగతా యానిమల్ కేర్ సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అకడ కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు ఇతర వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతే కాకుండా ఇతర మున్సిపాలిటీల నుంచి వలస వచ్చిన కుకలను వెంటనే స్టెరిలైజేషన్కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హెచ్ఎండీఏ పరిధిలో కూడా మరికొన్ని యానిమల్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మేయర్ ఈ సందర్భంగా వెల్లడించారు. వీధి కుకలకు అందిస్తున్న ఆహారం ఒకే గిన్నెలో వేయడంపై అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి సరిగా ఆహారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం కుకల స్టెరిలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి రోజు రెండు షిఫ్ట్లలో నిర్దేశించిన సర్జరీల కంటే ఎకువగా సర్జరీలు నిర్వహించాలని నిర్వాహకులను మేయర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంట డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ డా.అశోక్, వెటర్నరీ అధికారి డా.రాంచదర్, తదితరులు పాల్గొన్నారు.