సిటీబ్యూరో, జనవరి 18 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్కు నగరం ముస్తాబైంది. ఈనెల 27 నుంచి 29 వరకు సాహిత్య పండుగ కొలువుదీరబోతున్నది. సైఫాబాద్లోని విద్యారణ్య హైస్కూల్ వేదికగా రెండేండ్ల కరోనా విరామం అనంతరం మరోసారి సాహితీ ప్రేమికులను లిటరరీ ఫెస్ట్ అలరించనుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని రకాల కార్యక్రమాలతో నిర్వాహకులు ప్రణాళికలు రెడీ చేశారు.
ఈ మేరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ డైరెక్టర్స్ టి. విజయ్ కుమార్, అమిత దేశైలు బుధవారం బంజారాహిల్స్లోని గోతేజంత్రంలో విలేకరలు సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్కు అందరికి ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు. వివిధ భాషల సాహిత్యంపై అర్థవంతమైన చర్చలు ఉంటాయని వివరించారు.