శేరిలింగంపల్లి, జూన్ 24: అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారత్లో యూఎస్ఏ రాయబారి, దక్షిణాసియా-మధ్య ఆసియా ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్తో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ కాన్సుల్, ఎంఏకే ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయంలో వారు సమావేశమై మధ్య ఆసియాలో ముఖ్యంగా ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ దేశాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్, ట్రంప్ టవర్, జాకబ్ అండ్ కో తదితర బ్రాండ్ల భాగస్వామ్యంతో లగ్జరీ గోల్ఫ్ కమ్యూనిటీలు, బ్రాండెడ్ నివాస సముదాయాలు, మిక్డ్స్ యూజ్ లైఫ్ ైస్టెల్ డెస్టినేషన్ల అభివృద్ధి అవకాశాలను సమీక్షించారు. పెట్టుబడి అవకాశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై మరింత చర్చించేందుకు న్యూఢిల్లీలో మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించారు.