సికింద్రాబాద్/మారేడ్పల్లి, మార్చి 8: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు మహిళాబంధు కేసీఆర్ సంబురాల్లో భాగంగా మంగళవారం కంటోన్మెంట్ పరిధిలోని లబ్ధిదారులకు టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్లతో కలిసి ఎమ్మెల్యే సాయన్న రసూల్పురా, మడ్ఫోర్డ్ ప్రాంతాల్లో చెక్కులను పంపిణీ చేశారు. కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మహిళలకు చీరెలను పంపిణీ చేసిన అనంతరం రసూల్పురాలోని ముదిరాజ్ సంఘం భవన్లో 41 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయగా, మడ్ఫోర్డ్లో మరో 33 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను ప్రారంభించారన్నారు. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లాస్యనందితా, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, ప్రభాకర్, నళినికిరణ్తో నేతలు నివేదిత, లతామహేందర్, సరిత, దేవులపల్లి శ్రీనివాస్, పిట్ల నాగేష్, ఆంజనేయులు, శ్రీహరి, కిరణ్కుమార్, శ్రీను, సురేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మారేడ్పల్లి మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం తగిన గుర్తింపును ఇచ్చిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరీ, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, అరుణగౌడ్, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహ ముదిరాజ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆకుల హరికృష్ణ పాల్గొన్నారు.