బంజారాహిల్స్/హిమాయత్నగర్,మార్చి 8: ఖైరతాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనుల కోసం సుమారు రూ.26 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని భగత్సింగ్నగర్లో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మురుగు సమస్యలు పరిష్కరించడం, తాగు నీటి ఇబ్బందులు దూరం చేయడం కోసం జలమండలి ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నామన్నారు. దీనికోసం సుమారు రూ. 12కోట్లు ఖర్చుచేయనున్నామన్నారు. దీంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీహాల్స్ ఆధునీకరణ పనుల కోసం సుమారు రూ.14 కోట్ల నిధులు మంజూరయ్యాయని. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కల్యాణలక్ష్మి అందుకున్న లబ్ధిదారులతో పాటు మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
హిమాయత్నగర్ డివిజన్లోని గాంధీ కుటీర్బస్తీలో 11 మంది లబ్ధిదారులకు మంజూరైన షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, మాజీ కార్పొరేటర్ హేమలత యాదవ్తో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు రూ.6కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి,నాయకులు బాబుయాదవ్, రాజేందర్కుమార్, ప్రభాకర్గౌడ్, మహ్మద్ సర్ఫరాజ్, అశోక్, యతిరాజ్, రాజేంద్రప్రసాద్, ఐలమ్మ,బీజేపీ నాయకులు జి.రామన్గౌడ్, కేశబోయిన శ్రీధర్, కవిత, నర్సింగ్గౌడ్,జైస్వాల్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
రాష్ట్ర బడ్జెట్లో దళితబంధు పథకం కోసం అత్యధికంగా నిధులు కేటాయించడంతో పాటు సొంత స్థలాలు కలిగి ఉన్న పేదలకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపట్ల ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆనందం వ్యక్తం చేశారు. బస్తీల్లో నివాసం ఉంటున్న పేదలకు సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని, ఒక్కో నియోజకవర్గంలో సుమారు 3వేల మంది పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మామిడి నర్సింగరావు, డివిజన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, నగేష్ సాగర్, వెంకటస్వామి, అబ్దుల్ ఘనీ తదితరులు పాల్గొన్నారు.